News

అవగాహన లేని ప్రతిపక్షాలు


నిజామాబాద్‌ ఎంపీ కవిత మహా ఒప్పందంతో సీఎం కేసీఆర్‌ సాధించింది ఏమీ లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహన లేదని విమర్శించారు. తమ్మిడిహట్టిపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత జానారెడ్డి స్పష్టత ఇచ్చారన్న కవిత. అందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో 152 మీటర్లకు ఒప్పందం జరగలేదని జానారెడ్డి రాజకీయాలకు అతీతంగా మాట్లాడి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మిగతా కాంగ్రెస్‌ నేతలు కూడా జానారెడ్డి బాటలో నడిస్తే బాగుంటుందని హితవు పలికారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్లకే సీఎం కేసీఆర్‌ సంతకం పెట్టారని విమర్శలు చేయడం తగదన్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును తెదేపా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు.